Category : Prathipati | Sub Category : Chilakaluripet Posted on 2024-04-19 15:25:14
ప్రత్తిపాటి సమక్షంలో తెలుగుదేశంలో చేరిన వైసీపీ ముస్లిం నాయకులు
ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు అమలు చేసినా రాష్ట్రంలో ముస్లింలు, తెలుగుదేశం పార్టీని ఎవరూ విడదీయలేరన్నారు మాజీమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. అసత్య ప్రచారాలతో మైనార్టీల ఓట్లు దండుకోవాలని వైకాపా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించవనీ ఆయన స్పష్టం చేశారు. ముస్లింల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన అనేక సంక్షేమపథకాలు రద్దు చేయడంతో పాటు మైనార్టీ కార్పొరేష న్ నిధులనూ దారిమళ్లించిన మోసకారి జగన్ను ముస్లిం ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు ప్రత్తిపాటి. గురువారం చిలకలూరిపేట 13, 14వ వార్డుకు చెందిన వైసీపీ ముస్లిం నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారంతా ప్రత్తిపాటి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశంలో చేరిన వారిలో షేక్ ఉమ్మరవలి, షేక్ రబ్బానీ, షేక్ గని ఉన్నారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన ప్రత్తిపాటి రాష్ట్రంలో ముస్లింలకు చిత్తశుద్ధితో మేలు చేసింది, చేయ బోయేది కూడా తెలుగుదేశం పార్టీయే అని, వారి రిజర్వేష్లను కూడా కాపాడి తీరతామని హామీ ఇచ్చారు.