Category : Prathipati | Sub Category : Chilakaluripet Posted on 2024-04-19 15:14:18
ఆర్ఎంపీ, పీఎంపీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలన్నీ పరిష్కారిస్తామని స్పష్టం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ గ్రామీణప్రాంత ప్రజల ఆరోగ్యమిత్రులుగా నిలుస్తోన్న వారిని కాపా డుకుని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారాయన. గురువారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆర్ఎంపీ, పీఎంపీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రత్తిపాటి మాట్లాడుతూ ఆర్ఎంపీలు, పీఎంపీలు విష యంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన విధానంతో ఉందన్నారు. ఇదే విషయంలో ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వారికి మెరుగైన శిక్షణ, గుర్తింపులు కార్డులు అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. కొత్తప్రభుత్వంలో వందరోజుల్లోనే ఆ హామీ అమలు చేస్తామన్న కూటమి విజయం కోసం ఆర్ఎంపీ, పీఎంపీలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. నిజానికి ఆర్ఎంపీలు, పీఎంపీలు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మరణాల సంఖ్య ఎంతో పెరిగే ప్రమాదం ఉందన్నారు ప్రత్తిపాటి. ప్రాథమిక చికిత్స ద్వారా గ్రామాల్లో ఎంతోమంది ప్రాణాలను వారు నిలబెడుతున్నారని వారి సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. మనలాంటి పెద్దదేశం, గ్రామీణ జనాభా అత్యధికశాతం ఉన్న రాష్ట్రాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు లేకుండా వైద్యులే చికిత్స చేయాలంటే జరిగే పని కాదన్నారు ప్రత్తిపాటి. ఎంబీబీఎస్, పీజీలు చేసిన వారంతా పట్టణాలు వదిలి రాని తరుణంలో గ్రామీణ ప్రాంత వైద్యానికి అర్ఎంపీ, పీఎంపీ లు కీలక వారధులుగా మారారని కితాబిచ్చారు. అరకు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ప్రజలు ఆమాత్రం సేవలు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటికీ కూడా డోలీల్లో మోసుకెళ్లి వైద్యం అందిస్తున్నారని అన్నారు. అందుకే గ్రామీణవైద్యానికి వెన్నె ముకగా ఉన్న తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆర్ఎంపీలు, పీఎంపీలకు కమ్యూనిటీ హాల్తో పాటు 2సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సామాజిక అసోసియేషన్లకు ఒక గుర్తింపు వచ్చేలా చేస్తామని, వారందరికీ ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్ నిర్మించి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇదే సమయంలో చిలకలూరిపేట్ నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదన్నారు. ఒక్కఛాన్స్ అన్న మాట అని విడదల రజినీ కి అవకాశం ఇస్తే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని.. దోచుకుని పారి పోయారని మండిపడ్డారు. జగన్లాంటి ముఖ్యమంత్రినీ ఎవరూ చూసి ఉండరన్నారు ప్రత్తిపాటి. అతడు పేదల గురించి ఆలోచించే వ్యక్తి అయితే నాసిరకం మద్యం ఎందుకు సరఫరా చేస్తారని ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున 5ఏళ్లలో రూ.లక్షన్నర కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. జగన్ సరఫరా చేస్తున్న నాసిరకం మద్యం వల్ల కాలేయం, క్లోమగ్రంధి దెబ్బతిని ఆస్పత్రుల పాలయ్యే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. అందులో సమిధ లుగా మారుతోంది బడుగు, బలహీనవర్గాల నిరుపేదలే అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్రెడ్డి బటన్ నొక్కుడు పెద్ద మోసమన్న ప్రత్తిపాటి ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 4, 5సార్లు బటన్ నొక్కారని.. కానీ ఎవరి ఖాతాల్లో డబ్బులు పడలేదన్నారు. ఈ మధ్య ఆసరా, విద్యా దీవెన బటన్లు నొక్కినా ఎవరికి రూపాయి కూడా పడలేదన్నారు. 8 లక్షల వరకు సామాజిక పింఛన్లు తొలగించారని మండిపడ్డారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న తాను ఇప్పటివరకు ఐదుసార్లు పోటీ చేశానని, చిలకలూరిపేటలో ఇంతమార్పు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు ప్రత్తిపాటి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇంటికి ఐదారు పథకాలు అందిన పరిస్థితి నుంచి జగన్పాలనలో వాటిలో ఒకట్రెండు పథకాలు వచ్చిన వారు సగం మంది కూడా లేరని... అందుకే పేదలంతా జగన్ను ఓడించాలన్న కసి ఉన్నారన్నారు. ముస్లిం మైనార్టీలైతే వన్సైడ్ ఉండబోతున్నారని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల్లోనూ అదేమార్పు మొదలైందని, నవరత్నాలు అంటూ చేసిన నవవిధమోసాలకు అంతా జగన్కు తగిన గుణపాఠం చెప్పే సమయ దగ్గరపడిందన్నారు ప్రత్తిపాటి పుల్లారావు.